Thursday, 30 July 2026 09:28:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మైనారిటీ పేద నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ...

Date : 03 October 2023 09:37 AM Views : 767

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పేద మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషీ చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ లో ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా’ పథకంలో తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా’ అనీ నిరుద్యోగ మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లన పంపిణీ చేశారు. ఈ పథకంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్, చౌదరిగూడ, నందిగామ, ఫరూఖ్ నగర్ మండలాల్లోని ప్రజలకు 'కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా పథకం క్రింద 90 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే అంజయ్య మాట్లాడుతూ.. పేద మైనారిటీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీ మహిళల కోసం మైనారిటీ ఫై నాన్స్ కార్పొరేషన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ మహిళల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు పేర్కోన్నారు. ఈ పథకం కింద మైనారిటీ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. దీని వల్ల ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు లబ్ది చేకూరనుందని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారనీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 2000 కుట్టు మిషన్లను క్రిస్టియన్ మైనారిటీల కోసం రిజర్వు చేసినట్లు చైర్మన్ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, చైర్మన్ నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, రామకృష్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: