సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట (మండలం), అచ్యుతాపురం బీట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 హెక్టార్ ల్లో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇరు మండలాలోని పలు పాఠశాలల్లో డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన డ్రాయింగ్ మరియు ఎస్సై రైటింగ్, పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు MLA . ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను సిద్దం చేసుకుందని.దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు నడుం కట్టి.సంక్షేమం,అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి తలితారని.. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరిత హారం అని.ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33కోట్ల మొక్కలు నాటడం చాలా సంతోషంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు, అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్ ల సంగం అధ్యక్షులు, మల్లయిగుడెం సర్పంచ్ నారం రాజశేఖర్, మోహన్ రెడ్డి, కొయ్యల అచ్యుత్ రావు, యు. ఎస్ ప్రకాష్ రావు, చిన్నంసెట్టి సత్యనారాయణ, శ్రీను, కాసాని చంద్ర మోహన్, తాడేపల్లి రవి,రాయల నాగేశ్వరరావు, ప్రభాకర్,రమేష్, గుడవర్తి వెంకటేశ్వరరావు, ఆళ్ళ జంగం, ఇరు మండలాల MPDO లు, దమ్మపేట MRO,FDO తిరుమల రావు, శ్రీను,మోహన్, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin