సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షతనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు వెంకటాపురం (మం)సీతారాంపురం గ్రామం ఆలుబాక (జి) పీసా హెబిటేషన్ పరిధిలో ఉంది. కానీ అధికారులు పీసా చట్ట నిబంధనలు ఉల్లంఘించి వేరే పీసా అయినటువంటి బోధపురం గ్రామంలో పీసా గ్రామ సభను తప్పుగా నిర్వహించడం జరిగినది. పిసా నిబంధనలు పాటించలని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ హైదరాబాద్ వారి ఆదేశాలు జారీ చేశారు. సీతారాంపురం గ్రామం ఆలుబాక (జి) పీసా హెబిటేషన్ పరిధిలోనికి వస్తుందని అన్నారు.కానీ అధికారులు పీసా నిబంధనలకు విరుద్ధంగా బోధపురం గ్రామంలో వేరే హెబీటేషన్ అయిన గ్రామంలో పీసా గ్రామ సభను నిర్వహించి జిల్లా పరిపాలన అధికారికి తప్పుడు నివేదిక పంపించడం జరిగినది. జాయింట్ సర్వేలో జియో కోవర్డ్ నెట్స్ కూడా తప్పుగా నివేదిక పెట్టి ఆలుబాక లో తీయాల్సిన ఇసుక ను వేరే పీసా హెబీటేషన్ అయిన బోధపురంలో ఇసుకను తీయడం అనేది పూర్తిగా పీసా చట్ట విరుద్ధమని అన్నారు. తప్పుడు పిసా గ్రామసభను నిర్వహించి తప్పుడు తీర్మానాన్ని ఉన్నత అధికారులకు నివేదిక పంపిన మండల ఎం.పీ.డీ.ఓ మరియు బోధపురం గ్రామపంచాయతీ సెక్రటరీ ను సస్పెండ్ చేయాలి.అలాగే సీతారాంపురం ఇసుక క్వారీ అనుమతులపై ములుగు జిల్లా కలెక్టర్ మరియు ఐ.టి.డి.ఏ పి.ఓ సమగ్ర విచారణ జరిపి వారి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు,ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, బొగ్గుల ప్రశాంత్, తాటి నాగరాజ్, సురిటీ సందీప్, రఘు, సంజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin