సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బిజెపి దేశభక్తి మతోన్మాద ముసుగులో ప్రజల కళ్ళు కప్పి సామాన్ల ప్రజలను దోపిడీ చేస్తుంది. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, మహిళా కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ అమర్ జోహాన్ బేగం. గడపగడపకు మహిళా కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభయా హస్తం గ్యారెంటీ కార్డ్స్ అందజేశా రు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో చేపట్టిన కార్యక్రమంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే హామీపై అవగాహన కల్పించారు. చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ , సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామపంచాయతీ, నాగయ్య గడ్డ సెవెన్ ఇంక్లైన్ కాలనీ, లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పలుచోట్ల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది *జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న మాట్లాడుతూ* కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది కాంగ్రెస్ హస్తం_సామాన్యులకు అభయ హస్తం లాగా పని చేస్తుంది కాంగ్రెస్ చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది * పెరగని ఆదాయాలు పెరిగిన పన్నుల బారాలతో అన్ని వర్గాల ప్రజలు జీవితాలు అతలాకుతలమవుతున్నాయి బిజెపి దేశభక్తి మతోన్మాద ముసుగులో ప్రజల కళ్ళు కప్పి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మహిళల కొరకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి నెలకు 2500, 500 కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పేరిట ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇలా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చి మహిళ సోదరీమణులకు పెద్దపీట వేసింది అన్నారు *పార్లమెంట్ కోఆర్డినేటర్ అమర్జహాన్ మాట్లాడుతూ మోడీ సర్కార్ పైన తిరుగుబాటు చేయాలి మహిళలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసమే కాదు రైతన్నల కోసం యువత కోసం గ్యారెంటీ కార్డు ఇచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెట్టాలి అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణఅధ్యక్షురాలు శ్రీలక్ష్మి నాగోసి, అసెంబ్లీ కోఆర్డినేటర్ గోడ దివ్య, సరిత పందాల, మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు భాగ్య, రాజేశ్వరి, శారద, స్వర్ణకుమారి, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బాలు అరుణ పుట్టా యశోద, నాగేంద్రమ్మ, భూక్య దేవి, సావిత్రమ్మ, బాలచంద్రారావు , బాలు వీరభద్రం, మళ్లీ పెద్దిరాజు, సురేష్ గుప్తా, భూక్య లింగన్న తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin