సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎందరికో ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ సేవకుడికి కూడా అవకాశం ఇస్తే ప్రజాసేవలో తరిస్తాడని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లచ్చంపేట, తుమ్మలపల్లి, వనంపల్లి, తూంపల్లి, పద్మారం, ఎలుకగూడెం, లక్ష్మీదేవుని పల్లి, వీరన్నపేట్, గాలిగూడ, పెద్ద ఎలకిచర్లలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎందరికో అవకాశం ఇచ్చారు. ఈ సేవకుడికి అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వాడిని కనుక ఓటు అనే ఆయుధంతో సేవకుడికి ఓటు వేయాలని కోరారు. ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాను మీరు ఆశీర్వదిస్తే మరెన్నో సేవా కార్యక్రమాలతో మీ ముందు ఉంటానని అన్నారు. సింహం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ బాస్కర్, పసుల నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, రాజు, యాదయ్య, వీరేందర్ రెడ్డి, నల్ల ప్రభు,చెనగళ్ల కృష్ణయ్య, రామకృష్ణ రెడ్డి, రాఘవేందర్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, కుక్కల నర్సింహా, యాదగిరి, తదితరులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
-----------------------
Admin