సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా బీజేపీ 370 ఎంపీ స్థానాలను గెలుస్తుందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడోవసారి ప్రధానమంత్రి ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించడం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైయిందన్నారు. నేటికి దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తున్నామని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి దేశంలో ఉగ్రవాదం ను అణచివేయడం జరిగిం దన్నారు. త్రిబుల్ తలాక్ కు రద్దు చేసి ముస్లీం మహిళలకు మేలు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడి కి దక్కుతుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేయడం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తోనే సాధ్యమైందన్నారు. యూపీఏ పాలనలో భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో 11వ స్థానంలో ఉన్నామని, నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి 11వ స్థానం నుంచి 5 వ స్థానం కు రావడం జరిగిందన్నారు. దేశం లో ఉన్న పేదలందరికి ఉచితంగా ఇళ్లు నిర్మాణం చేసి పేదలకు అందజేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నాడని అన్నారు. రానున్న ఎం పీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో నల్లగొండ బీజేపీ అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపాలని ఆయన అన్నారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు.
-----------------------
Admin