Saturday, 13 June 2026 12:45:14 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ గ్రామాల ప్రజలు... - టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విర్లపల్లి శంకర్

Date : 24 July 2023 12:47 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ : రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.. ఆదివారం ఫారూఖ్ నగర్ మండలంలోని అన్నారం, రామేశ్వరం, జంగోని గూడ సుమారు 300 వందల మంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ప్రశ్నించే వారిని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న మణిపూర్లో ఘోర పరిస్థితి నెలకొందని ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం దారుణమైన విషయమని అన్నారు. ఈ హింసాత్మక ఘటనను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పై విసుగు చెందారని, కెసిఆర్ కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కుటుంబాలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారూఖ్ నగర్ మండలాధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బాబర్ ఖాన్, బాలరాజు గౌడ్, రఘు, లంకల రఘు గౌడ్, వెంకటేష్ గౌడ్, రాములు యాదవ్, అంజయ్య యాదవ్, మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, టీ రవి, శ్రీశైలం గౌడ్ తదితరులున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :