సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు జనరల్ మేనేజర్,పరిశ్రమలశాఖ, సూర్యాపేట జిల్లా వారి ఆదేశాలకు మేరకు పాలకవీడు మండలంలోని,డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కర్మాగారం ఆధ్వర్యంలో, పరిశ్రమకు సమీపాన గల రావిపహాడ్ గ్రామరోడ్డులో హరితహారకార్యక్రమాన్నిపురస్కరించుకొని సుమారు 250 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్... యస్.నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం తో భూమి యొక్క వాతావరణ సమతుల్యత లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులుఏర్పడుతున్నాయని,వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్ల పెంపకం ఒక్కటే సరి అయిన మార్గం అని అన్నారు.ఈకార్యక్రమంలో వివిధశాఖలఅధిపతులుపి.యస్.రావ్,యం.డి.మస్తాన్,నరసింహ రెడ్డి ,యన్.యస్.ప్రవీణ్ కుమార్,వెంకటేశ్వర్లు, తిరుపతి రావ్,స్టాఫ్,వర్క్ మెన్, కార్మికులు పాల్గొని ప్రతి ఒక్కరు తమ వంతుగా చెట్లను నాటారు.
-----------------------
Admin