సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ లో చేరిన ఇరువురు సర్పంచ్ లు, జాన్ పహాడ్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ఊపందుకున్నాయి.ఇప్పటికే హుజూర్ నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి ప్రధాన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా పాలకవీడు మండలం చెరువుతండా సర్పంచ్ దేవి కృష్ణ నాయక్ , సజ్జాపురం సర్పంచ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చెన్నబోయిననరసింహ , జాన్ పహాడ్ ఎంపీటీసీ బానవత్ విజయ వెంకటి నాయక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎంపీ ఉత్తమ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విధానాలు, సంక్షేమ పథకాల అమలు తీరు నచ్చక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోచేరినట్లువారుతెలిపారు.సజ్జపురం సర్పంచ్ నరసింహ మూసీ నది నుండి సజ్జపూరం చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో త్రాగునీరు,సాగునీరు కొరత లేకుండా చూడాలని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు, రానున్న ఎన్నికల్లో ఉత్తమ్ ను అధిక మెజార్టీ తో గెలిపించడం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బెట్టేతండా సర్పంచ్ మాలోత్ మోతిలాల్ నాయక్, భూక్య నాగరాజు షైనావలి , సందీప్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin