సర్కార్ టీవీ న్యూస్ / నంద్యాల జిల్లా : నందికొట్కూర్ నియోజకవర్గ కేంద్రంలోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్న మలిరెడ్డి రాములమ్మ (35) అనే వివాహిత మహిళ ను ఆమె నివాసం ఉన్న ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు గొంతు అతి కిరాతకంగా కోసి చంపారు. వివరాలో కి వెళితే. కొత్తపల్లి మండలం ఎర్రమట గ్రామానికి చెందిన రాములమ్మను గత 20 సంవత్సరాల క్రితం పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన బాలయ్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఇదివరకే భార్యాభర్తలు మనస్పర్ధ కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. నందికొట్కూరు పట్టణంలోని మారుతీ నగర్ లో 8 సంవత్సరాలుగా వేరు కాపురం ఉంటూ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. స్థానికుల సమాచారం మేరకు ఆత్మకూరు డిఎస్పి ఏ శ్రీనివాసరావు, నందికొట్కూర్ అర్బన్ సీఐ వో విజయ భాస్కర్ ఎస్ ఐ ఎన్ వి రమణ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూర్ డిఎస్పి ఏ శ్రీనివాసరావు, సీఐ విజయభాస్కర్ తెలిపారు...
-----------------------
Admin