సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో ధాన్యాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. తిరుమలగిరి మార్కెట్ యార్డ్ కు శనివారం అత్యధికంగా ధాన్యం వచ్చిన నేపథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులు మార్కెట్కు సెలవు నేపథ్యంలో శనివారం ఒక్కసారిగా 60 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ ధాన్యం వచ్చిందని తక్కువ రేట్లకు దాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శికి సూచిస్తూ రోజుకు 2వేల బస్తాలకు పైగా టోకెన్లు ఇవ్వాలని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరారు. రైతులపై దందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు కమిషన్లు పెట్టి రైతులను ముంచితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
-----------------------
Admin