సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల మండలం : రాజకీయ కక్ష సాధింపులతో ఎన్నో ఏళ్ల నుంచి అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను ఆయాలను తొలగించడం మానుకోవాలని, గోరంట్లలో ఏ ఐ టి యు సి నాయకులు తెలిపారు . శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని భూగానపల్లిలో భారతమ్మ అను అంగన్వాడీ టీచర్ ను రాజకీయ కారణాలతో తొలగించడం బాధాకరమని పది సంవత్సరాల నుంచి అంగన్వాడి కార్యకర్తగా ఉంటూ పనిచేస్తున్న ఆమెను తొలగించడం సిగ్గుచేటని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, శ్రీరాములు, సుధాకర్, సురేష్ బాబు తదితరులు భూగానపల్లిలో తొలగించినటువంటి అంగన్వాడీ టీచర్ భారతమును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూడా కారణంగా రాజకీయ జోక్యంతో వారికి కావలసిన వారిని ఆస్థానంలో పెట్టుకునేందుకు అధికార పార్టీ నాయకులు అంగన్వాడీల పుట్టగొడుతున్నారని వీరికి ఐసిడిఎస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడి వర్కర్లను ఆయాలపై రాజయ కీయ కక్ష ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి తొలగించిన అంగన్వాడీ టీచర్ కు న్యాయం చేయాలని కోరారు.
-----------------------
Admin