సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంగా నైరుతి వార్త టీవీ ఛానల్ ను స్థానిక 32 వ వార్డు కౌన్సిలర్ షేక్ జహీర్ ప్రారంభించారు. తదుపరి లోగో ఆవిష్కరణ చేసి సంస్థ ఎడిటర్ రఘువరన్ ఆచార్యులుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ వాస్తవిక వార్తలను నిరూపకత చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా బాధితులకు అండగా నిలిచే స్ఫూర్తిగా నైరుతివార్త టీవీ ముందుకు సాగాలని స్థానిక 32 వ వార్డు నందు ఈ టీవీ ఛానల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. వార్త టీవీ యాజమాన్యం రఘువరన్ మాట్లాడుతూ టీవీ ఛానల్ కార్యాలయం ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ జహీర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ నాయకులు శ్రీరామ్ నగర్ కాలనీవాసులు సూర్యాపేట పట్టణ అర్చకులు టీఎస్ జే ఏ రాష్ట్ర నాయకులు మరియు ఇతర మీడియా మిత్రులు పాల్గొన్నారు..
-----------------------
Admin