సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు వైఎస్ఆర్ సీపీ మండల ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షులుగా మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన బాబాజాన్ నియమిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కార్యాలయం అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనపై నమ్మకంతో తమ సామాజిక వర్గ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా తనకు ఈ అవకాశం కల్పించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ కోసం నిరంతరం కృతనిశ్చయంతో పనిచేస్తానని, సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు బాబాజాన్ ధన్య వాదాలు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కోళ్ళ కృష్ణారెడ్డి, మండల రాజు నాయుడు, మండల వ్యవసాయ అగ్రి అడ్వాన్స్ చైర్మన్ లక్ష్మి రెడ్డి, మైనార్టీ నాయకులు జిల్లా వర్క్ బోర్డ్ డైరెక్టర్ జౌలిబాబా, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆరీఖాన్ , మండల మైనార్టీ కోఆప్షన్ నెంబర్ నిస్సార్ అహ్మద్, బాబాసాహెబ్ పల్లి షాకీర్, జనతా గ్యారేజ్ సలీం, బాబ్జాన్ (లడ్డు) మైను, బైరిశెట్టి, దాబు భాయ్ ఆరిఫ్ రఫిక్ పాటు పలువురు పాల్గొన్నారు.
-----------------------
Admin