సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం గ్రామ సర్పంచ్ షేక్ ఆయేషా అమీర్ సాహెబ్ కు గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా శాలువా గజమాలతో సత్కరించి సన్మానించారు. సర్పంచ్ గా షేక్ ఆయేషా అమీర్ సాహెబ్ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశారని.అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించారనీ పలువురు వక్తలు వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లో సిబ్బంది..ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం గ్రామ ప్రముఖులు,గ్రామపంచాయతీ పాలకవర్గం,సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొన్నారు..
-----------------------
Admin