సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఆజాద్ అధికార్ సేన రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తగూడెం సినియర్ పాత్రికేయులు, ఉషోదయ చారిటబుల్ ట్రస్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సూర్యా ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడారు. ఆజాద్ అధికార్ సేన జాతీయ అధ్యక్షులు అమితాబ్ ఠాగూర్ (మాజీ ఐపిఎస్), జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణా, సెంట్రల్ కార్యాలయం లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తర్వులను పంపించడం జరిగింది . రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆజాద్ అధికార్ సేన పార్టీ నుంచి వద్రాద్రి) కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజ వర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసేందుకు అనుమతులు ఇచ్చారని అన్నారు. అంతే కాకుండ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆజాద్ అధికార్ సేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. గడప గడపకు రాజ్యాంగం చేరేలా ప్రతి పౌరునికి సమన్యాయం జరిగేలా సబ్బండ వర్గాలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలు అన్యాయాలపై అవినీతి, అణచివేతలపై ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన జర్నలిజం ద్వార అలుపెరగని పోరాటం చేస్తున్న ఇమంది ఉదయ్ కుమార్ పై నమ్మకం ఉంచి ఆజాద్ అధికార్ సేన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం పట్ల జాతీయ అద్యక్షలు అమితాబ్ ఠాగూర్ జాతీయస్థాయి కార్యదర్శి దేవందర్ సింగ్ రాణాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల సుధాకర్ రావు ,అల్లపు శంకర్, దశరథ రజువా, సీమకుర్తి రామకృష్ణ ,ఇమంది గణేష్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా ఆజాద్ అధికార సేన పార్టీ తరఫునుంచి పోటీ చేస్తున్న సందర్భంగా పాత్రికేయ వర్గం హర్షం వ్యక్తం చేసింది.
-----------------------
Admin