సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ఆయన గురువును శాలువాతో సత్కరించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో బిజీగా ఉన్నపటికీ టీచర్స్ డే సందర్బంగా తనకు చండ్రుగొండ మండలం తుంగారంలో ప్రాధమిక విద్యాబోధనలు చేసిన గురువును కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు ప్రాథమిక విద్య నేర్పిన గురువును కలిసి ఆయన్ని సత్కరించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టమని నేడు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన గురువులు నేర్పిన పాటలేనన్నారు. సర్వమత ప్రార్థనలతో తన గురువులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
-----------------------
Admin