సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దుగ్గొండి సర్కార్ న్యూస్ దుగ్గొండి మండల్ వ్యవసాయ పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కశివోజుల బ్రహ్మం తన వ్యవసాయ భూమిలో గత ఐదు ఏండ్లుగా మీరప పంట వేసి దిగుబడి రాకపోవడంతో ఆర్థిక నష్టం జరగడం వల్ల దీంతో ప్రైవేట్అప్పులు ఇచ్చిన వాళ్లు ఫైనాన్స్ వాళ్ళు ఐదు లక్షల వరకు అప్పు చేశాడు వాటిని తీర్చలేక ఇబ్బందులకు గురికావడం వల్ల మనస్తాపంతో సోమవారం ఉదయం పంట చేనుకు నీళ్లు పెడతానని చెప్పి ఇంటి నుండి వెళ్లి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు అటుగా వెళ్లిన బ్రహ్మం తమ్ముడు మృతుడి టూత్ బ్రష్ వ్యవసాయ బావిలో తేలియాడుతుండడంతో బ్రహ్మం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకొని గ్రామస్తులు పోలీసుల సహకారంతో వ్యవసాయ బావిలోని నీటిని మోటార్ల సాయంతో తోడుతుండగా బావిలో బ్రహ్మం మృతదేహం బయటపడింది మృతుడు మెడకు బండరాయి కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడికి భార్య శ్రీలత ఇద్దరు కుమారులు ఉన్నారు మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్ తెలిపారు
-----------------------
Reporter