Thursday, 30 July 2026 11:28:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి... - కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్

Date : 24 July 2023 12:41 AM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మణిపూర్ లో జరిగిన జాతుల ఉద్యమంలో మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నాడు షాద్ నగర్ పట్టణంలో జరిగిన సిపిఐ నియోజకవర్గ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత సమాజం తలదించుకునే విధంగా దుండగులు మహిళలను వివస్త్రాలను చేసి ప్రదర్శన చేయడం సామూహిక అత్యాచారం చేయడం ఆటవిక పాలనను గుర్తు చేస్తుందని అందుకోసమే మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ.. నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జూలై 25న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పూరి గుడిసెలు ధ్వంసమైన రోడ్ల ను బాగు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన తెలిపారు పార్టీని ప్రజాసంఘాలను గ్రామాలకు విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల గంగయ్య, ఎం శ్రీను, మండల కార్యదర్శి ఎం గోవిందు నాయక్, ఎండి షకీల్, గడ్డం జంగయ్య, చెన్నయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎం పవన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: