సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం, -సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని, - టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ . అభాగ్యులకు అండగా...ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 61మంది సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన రూ.23.65లక్షల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.....పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ,ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,వైస్ చైర్మన్ రహత్ అలీ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరపతయ్య,ఎంపీపీ సలహాదారుడు బాణావత్ హన్మ నాయక్,ఏర్పుల గోవింద్ యాదవ్,నట్వ గిరిధర్,వాడిత్య దేవేందర్ వేముల రాజు,వంకునవత్ బిక్కు నాయక్,వింజమురి రవి,బోడ్డుపల్లి కృష్ణ,వాడిత్య బాలు,కలిమ్,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin