సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆదేశానుసారం హుజూర్ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు చిలక సైదయ్య ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్(టీ ఎస్ జే ఎ)ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా (టీ ఎస్ జే ఎ)వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టే నాగరాజు యాదవ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా (టీ ఎస్ జే ఎ) గౌరవ సలహాదారుడు రామకృష్ణారెడ్డి విచ్చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు చిలక సైదయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత కోసం జర్నలిస్టుల సమస్యల కోసం టీ ఎస్ జే ఏ పనిచేస్తుందని అందరూ కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఏ చిన్న సమస్య వచ్చినా అధ్యక్షుడిగా ముందుండి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిలక సైదయ్య ,మాతంగి రవి ,చేపూరి నరసింహ చారి , ఉపాధ్యక్షులు పెందుర్తి సతీష్ ,సహాయ కార్యదర్శి దాసరి సతీష్ ,కోశాధికారి తాళ్ల ప్రసాద్ ,ప్రచార కార్యదర్శి అల్వాల రవి కుమార్,కార్యవర్గ సభ్యులు కల్వకుంట్ల సైదులు , నెమ్మది వెంకటేశ్వర్లు,మద్దుల నాగేశ్వరరావు ,గోబి రాము ,పిడమర్తి గురవయ్య ,శివ, మీసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin