సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ మండలం అలగడప గ్రామంలో నూతనంగా 3.25 కోట్లతో మంజూరు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి బాలికలకు మెరుగైన ఉన్నత విద్యలను అందించాలని లక్ష్యంతో ఇంటర్మీడియట్ కళాశాల భవన నిర్మాణం చేయడం జరుగుతుంది అని అన్నారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి, విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన విద్యను అందించేందుకు కస్తూర్బా,మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 40 శాతం డైట్,కాస్మొటిక్ చార్జీలను పెంచి వారికి అండగా ఉందని అన్నారు. ఆడబిడ్డ చదువు కేవలం ఒక ఇంటికి మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని అన్నారు. కావున బాలికలు అందరూ మంచిగా చదువుకొని విద్యలో రాణించాలని మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా నేను అండగా ఉంటా అని అన్నారు. కళాశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మార్వో , ఎంఈఓ , మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin