సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అధికారం లేనప్పటికీ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసమే నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఎమ్మెల్యేగా గెలిస్తే మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చౌదరిగూడ మండలంలోని జిల్లెడ్, చెన్నారెడ్డి గూడ, చేగిరెడ్డి గణపూర్, చింతకుంట తాండ, ముష్టిపల్లి గ్రామాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయా గ్రామాల్లో విష్ణువర్ధన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ప్రచారంలో భాగంగా విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సేవకుని మీద కక్ష సాధింపుకు దిగడం ఏంటని అన్నారు. ఎంతో మంది అవమానాలకు గురి చేసినా కక్ష సాధింపుకు దిగిన తన పని తాను చేసుకుంటూ వెళ్ళానని అన్నారు. దోచుకొని దాచుకునే వాల్లకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని అన్నారు. ఏ అధికారం లేకున్నా మీ మధ్యలో ఉండి ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినవాడిని మీరు ఆశీర్వదిస్తే మరెన్ని సేవా కార్యక్రమాలతో మీకు అండగా ఉంటానని అన్నారు. కొమరక్క మాట్లాడుతూ ఏ ఊరికి వెళ్ళినా విష్ణన్నను అంబలన్న, చీరలన్న, పేరుతో పిలుస్తుండడం చాలా గొప్ప విషయం అని అన్నారు. మీకు అండగా ఉన్న విష్ణన్న గుర్తు సింహం గుర్తు కాబట్టి సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, గొల్ల మల్లేష్, విఠల్ నాయక్, శ్రావణ్, చెనగళ్ల కృష్ణయ్య, రవీందర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, గోవర్ధన్ రెడ్డియాదగిరి, పరిగి శివ, నర్సింహా, శ్రీనివాస్, మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
-----------------------
Admin