సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ జాతీయ బీసీ జేఏసీ అధ్యక్షులు పోసాని శ్రీరాములు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ కు శాశ్వత భవనం నిర్మించాలని మండల తాసిల్దార్ కి అర్జీ ఇవ్వటం జరిగింది... ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ బీసీ హాస్టల్ కు సొంత భవనాలు లేవు అద్దె భవనాలలో వసతి గృహాలు నడుపుతున్నారు. ఆ భవనాలలో కనీస మౌలిక వసతులు లేక పోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. దీనివలన హాస్టల్లో ఉండే విద్యార్థులు విద్యపై సరిగ్గా శ్రద్ధ వహించలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో వీళ్లకు అన్యాయమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో గ్రామ సచివాలయాలు., రైతు భరోసా కేంద్రాలు అంగన్వాడి ఇంద్రాలకు వెంటనే శాశ్వత భవనాలు నిర్మించారు. కానీ మా బీసీ విద్యార్థులు ఉండే హాస్టల్స్ కు మాత్రం స్థలాలు లేవు శాశ్వత భవనాలు కట్టించలేకపోతున్నారు. పై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని బీసీ సంఘాలు కోరుతున్నారు....
-----------------------
Admin