సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మక్తల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి మక్తల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ ఇవ్వాలి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్వి రామారావు, బి.నర్సింలు, BKR ఫౌండర్ బాలకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గీతా సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, DCC అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కే. సిద్దార్ధ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, పోలీస్ పటేల్ చంద్రశేఖర్ రెడ్డి, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్యప్రకాష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవికుమార్ యాదవ్ ,గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin