సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ వైపే యువత పెద్ద ఎత్తున వస్తున్నారని గ్రామాలకు గ్రామాలు అంజన్న నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నాయని షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల మొగిలిగిద్ద గ్రామ యువ నాయకుడు గుట్ట రాజు అన్నారు. సోమవారం మొగిలిగిద్ద గ్రామంలో స్థానిక నాయకుడు గుట్ట రాజు ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. నియోజక వర్గంలో యువత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ప్రతిపాదిస్తూ, గ్రామ గ్రామాన కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి వస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. నాయకులు మారుతున్నా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి సమకూరుతున్నారని అన్నారు. మొగిలిగిద్దలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపిస్తున్న గ్రామ యువతకు మండల శ్రేణులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు జరిగే వరకూ గ్రామాన్ని పటిష్ట పరిచి పార్టీకి లాభం చేకూర్చాలని ఎన్నికల్లో గెలుపొందాక మొగలిగిద్ద గ్రామానికి ఏం చేయాలో కార్యకర్తల ప్రజల అభీష్టం మేరకు సమస్యలు నెరవేర్చుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోహమ్మద్ సిరాజ్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin