సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విచ్చేయుచున్న నేపథ్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చౌటపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు జరుగు ఇట్టి ఆత్మీయ సమ్మేళన సభా ప్రాంగనం మరియు పార్కింగ్ స్థలాలను పరిశీలించి, సభకు విచ్చేయుచున్న అభిమానులకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, స్నేహపూర్వక వాతావరణంలో సభను నిర్వహించేలా చూడాలని పరిశీలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండా బ్రహ్మ రెడ్డి ,మండల ఎంపీపీ మూడవ పార్వతి కొండ నాయక్ , జెడ్పిటిసి జగన్ నాయక్ , మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , సీనియర్ నాయకులు ధరావత్ నవీన్ నాయక్ , మండల ఉపాధ్యక్షులు ఇరిగేల వెంకటరెడ్డి , మండల యూత్ అధ్యక్షులు బూసిపల్లి వెంకటరెడ్డి , మండల అధికార ప్రతినిధి రమావత్ రవీందర్ నాయక్ , రఘునాథపాలెం మసీదు కమిటీ చైర్మన్ హఫీజ్ ఖాన్ , సోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి , హుజూర్ నగర్ పట్టణ యూత్ అధ్యక్షుడు సోమగాని ప్రదీప్ , చౌటపల్లి సర్పంచ్ గుండె పంగు కృష్ణవేణి నరేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు....
-----------------------
Admin