సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం,నారక్కపేట గ్రామానికి చెందిన యూత్ నాయకులు కందకట్ల రాకేష్,తౌటం నాగరాజు గార్లు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈసందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా BJYM ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,నారక్కపేట గ్రామా బీజేపీ నాయకులు ఓదెల అశోక్,శివ మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin