సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలక వీడు మండలంలో ఎంపి,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.వి సుబ్బారావు అధ్వర్యంలో జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం ఆలోచించే నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలిఅని,మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.అనంతరం భక్తులకు పండ్లు,బిస్కెట్స్, పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాలఉపేందర్, కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ నర్సింహారావు,బానవత్ సైదా నాయక్,రామారావు,అందే రాజు,బుడిగె సైదులు,శ్రీకాంత్,శేషు, కూరపాటి శ్రీనివాస్, పేరురి నాగయ్య, సైదారావు,దావీదు, మస్తాన్,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin