సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలం లోని నాయకులగూడెం నందు గల శ్రీ ఫార్మసీ కళాశాల నందు బుధవారం నాడు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎ. పుష్పలత ఆర్ఎంవో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొత్తగూడెం, కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. చిరంజీవి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా డా. పుష్పలత మాట్లాడుతూ విద్యార్థులు మధ్య సహృద్భావ వాతావరణం పెంపొందించిన కి కార్యక్రమం ఎంతగానో చేస్తుందన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు అవసరమైన సలహాలు అందిస్తూ వారు తమ లక్ష్యసాధనకు కృషి చేసే విధంగా దిశా నిర్దేశం చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలన్నారు. ఫార్మసీ రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఘన స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డి. హరీష్, ఎస్. ఉషశ్రీ, నాగమణి, రాజేశ్వరి, మంజు, హసీనా బేగం, పద్మజా, ఉష, వేణు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin