సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడా మండల్ : టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రజల మనుగడ జీవన విధానం మారుతుందని ఎంతోమంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలకు తెలుసని ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతారని అధికార పార్టీపై ప్రజలకు వ్యతిరేకిత వచ్చిందని టి పి సి సి కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఏకపక్ష ధోరణి పార్టీ తీరు నచ్చక టిఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు వేడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడా మండలం గుర్రంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు వందమందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి శంకర్ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని. అధికార పార్టీకి దీటుగా నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నికార్సుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చేయబోయే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని మరికొన్ని రోజుల్లోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. చౌదర్ గూడా మండల్ గుర్రంపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్ర పల్లి రాజు, దస్తగిరి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పార్టీలో చేరికలు శంకర్ తెలిపారు...
-----------------------
Admin