సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. షాద్ నగర్ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వనపర్తి వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు, క్షతగాత్రులను వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన వారు మృత్యుపాలయ్యారు. పాన్ గల్ మండలం మందాపుర్ గ్రామానికీ చెందిన అశోక్(28), పాన్ గల్ మండలం తెల్లరాల్లపల్లి తండాకు చెందిన శంకర్(32), నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నారియా నాయక్ తండాకు చెందిన రవి(30) లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం అతివేగమా లేక నిద్ర మత్తులో జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
-----------------------
Admin