సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగే గిరిజనుల ఆరాధ్య దైవ్యం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈనెల ఫిబ్రవరి లో జరిగే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా తాడ్వాయి మండలo కొండపర్తి గ్రామానికి చెందిన అరేం లచ్చు పటేల్ గారిని చైర్మన్ గా కమిటీ సభ్యులుగా... చిలుకూరు ఐలయ్య, కోడి గోపాల్, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగేర్ల రాజారత్నం, యాప అశోక్ , పోరిక నారాయణ్ సింగ్, మంజుల బిక్షపతి గౌడ్, సుంచా హైమావతి, చామర్తి కిషోర్, కోరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, ఎక్స్ అఫీషియల్ మెంబర్గా సిద్దబోయిన జగ్గారావు లను నియమించింది, ఈనెల ఫిబ్రవరి 15వ తారీఖు నాడున రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ & కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
-----------------------
Admin