సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండల్ : షాద్ నగర్ నియోజక వర్గంలోని నందిగామ మండలం బండ కుంట తండాలో గత 15 రోజుల క్రితం తండావాసులు త్రాగునీటికి ఇబ్బంది ఉంది అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ దృష్టికి తేవడంతో సోమవారం తండాలో బోరు వేశారు. బోరు మోటర్ ను వీర్లపల్లి శంకర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు జంగా నర్సింహ, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమార స్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి, తుపాకుల శేఖర్, ముబారక్, రాయికల్ శ్రీనివాస్, సుదర్శన్, అశోక్, శ్రీధర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు. బోరు సౌకర్యం కల్పించిన వీర్లపల్లి శంకర్ కు, కాంగ్రెస్ నాయకులకు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Admin