సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల నుండి పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ షేక్ హైమద్ అధ్యక్షతన బిజెపి బి ఆర్ఎస్ పార్టీల నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు వడ్డెర కాలనీ లక్ష్మి, వాడు మెంబర్గా గౌడ రాధ, ఎర్రసైలు మరియు యువకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినయ్ అన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు . రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి పాపాని కి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది లేదు అలాగే ఆసరా పింఛన్లు మంజూరు చేసింది లేదన్నారు. నిత్యవసరాల ధరలు, బస్సు చార్జీలు,కరెంటు చార్జీలు పెంచుకుంటూ పోతూ ప్రజల్ని ఆగం చేసిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కబ్జా చేసిందే తప్ప అభివృద్ధి మాత్రం చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సమక్షంలో చేరిన మహిళలకు పెద్దలకు యూత్ క్యాడర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మకులూరు మండల అధ్యక్షులు రవి ప్రకాష్ గారు ఉప సర్పంచ్ షేక్ హైమద్ మాజీ విడిసి అధ్యక్షులు పుప్పలచిన్న,గ్రామ అధ్యక్షులు మహేష్, గోవుల పెద్ద గంగాధర్, శ్రీకాంత్, చింటూ, సాగర్, భూమన్నగ్రామ ప్రజలు కార్యకర్తలు, నాయకులుపాల్గొన్నారు.
-----------------------
Admin