సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / న్యాయస్థానంలో న్యాయం వైపు ఉన్న బాధితులను గెలిపించాలని తద్వారా న్యాయాన్ని కాపాడాలని కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. షాద్ నగర్ న్యాయస్థానంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఎంపికైన ప్రముఖ న్యాయవాది కంచి రాజగోపాల్.. కేశంపెట ఎంపీపీ రవీందర్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించి ప్రజల మన్ననలు చూరగొన్న కంచి రాజగోపాల్ ఏజీపీగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎజిపి రాజగోపాల్ ఎంపిపి రవీందర్ యాదవ్ ను సన్మానించి స్వీట్ తినిపించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
-----------------------
Admin