సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించడమే భారత టెలికం శాఖ లక్ష్యమని భారత టెలికం ప్రాధికార సంస్థ ట్రాయ్ కాగ్ సభ్యుడు,రావూరి ప్రభాకర్ రావు అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో సూర్యాపేట మండల సమైక్య కార్యాలయంలో షేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సు లో ఆయన పలు విషయాలను కార్యక్రమములో పాల్గొన్న వారికి తెలియజేశారు.1997 సంవత్సరం లో టెలికాం వినియోగదారుల హక్కుల కోసం టెలికాం రెగ్యూలేటర్ అథారిటీ అఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చారని, టెలికాం రంగం లో ప్రపంచం లోనే భారత దేశం రెండవ స్థానం లో ఉందని, వినియోగదారులు ఉత్తమమైన సేవలు అందుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ నో.2006 నుంచి పోర్టబిలిటీ అవకాశాన్ని కల్పించినట్లు,2025 నాటికి దేశ వ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాలలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషిచేస్తామని అన్నారు.ఐడియా ,రిలయన్స్ ,జియో ,ఆధారిత సంస్థలు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.వినియోగదారులకు ఏ విధమైన లోపాలు వచ్చినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి,అనవసరమైన వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కాల్స్ గాని ఎస్ఎంఎస్ నియంత్రించే అంశాల పై వినియోగదారులకు అవగాహనా కల్పించారు.ఈ సదస్సు లో కాగ్ సభ్యులు ఆర్ ప్రభాకర్ రావు వినియోగ దారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల గురుంచి తెల్సుకొని,వాటిని ఎలా ఎదుర్కోవాలో ట్రై సభ్యుడు ప్రభాకర రావు అందరికి అర్ధం అయ్యేలా వివరించారు.ఈ కార్యక్రమం లో ఏపిఎం రణపంగా వెంకన్న ,మండల అధ్యక్షులు లక్ష్మమ్మ,సీసీ విజయబాను,సీసీ జె. సైదులు,పటేటి సునీత అకౌంటెంట్ కందుకూరి జ్యోతి,సిఆర్పి ఎం. సుజాత,కంప్యూటర్ ఆపరేటర్ జటంగి.నాగేంద్ర ,మండల సమెక్య కార్యవర్గ సభ్యులు వివోలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin