సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : డిసెంబర్ 16,17 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా,తాడేపల్లి గూడెం లోని బుద్దాల కన్వెన్షన్ హల్ లో 30 గంటల 30 నిమిషాల 30 సెకెన్ ల పాటు నాన్ స్టాప్ గా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మి, శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ ఛైర్మెన్ సినీ గేయ రచయిత శ్రీ కత్తిమండ ప్రతాప్ లు హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు.ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో కవితా పఠనం విభాగంలో "నారి లోకం" అనే కవిత తో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సూర్యపేట జిల్లా,హుజూర్ నగర్ మండలం,హుజూర్ నగర్ గ్రామంలోని యువ కవయిత్రి శ్రీపాద అర్చనా దేవి D/O రమణాచారి శ్రీ శ్రీ కళా వేదిక ప్రముఖులు అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. టీ ఎన్ ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) మరియు కల్చరల్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేస్తున్నట్లుగా ధృవీకరిస్తూ ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం అందజేసి,అనంతరం మెమంటో, శాలువ పూల మాలతో సత్కరించారు.దుంపాల వీరేష మాట్లాడుతూ. శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ "నారి లోకం" అనే కవిత ను ఉత్తమ కవితగా ఎంపిక చేసి శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో సన్మానంతో పాటు,ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం, జ్ఞాపిక ను అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని ముందు ముందు మరిన్ని మంచి కవితలు రాస్తానని ఆయన అన్నారు.ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం అందుకున్న శ్రీపాద అర్చనాదేవి ని పలువురు రాజకీయ వేత్తలు,గురువులు, గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు, అభినందించారు.
-----------------------
Admin