Saturday, 13 June 2026 02:03:30 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రపంచ తెలుగు సాహిత్య-కళా ఉత్సవాలలో సత్తా చాటిన హుజూర్ నగర్ గ్రామంలోని యువ కవయిత్రి శ్రీపాద అర్చనా దేవి D/O రమణాచారి...

Date : 19 December 2023 08:47 AM Views : 225

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : డిసెంబర్ 16,17 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా,తాడేపల్లి గూడెం లోని బుద్దాల కన్వెన్షన్ హల్ లో 30 గంటల 30 నిమిషాల 30 సెకెన్ ల పాటు నాన్ స్టాప్ గా నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మి, శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ ఛైర్మెన్ సినీ గేయ రచయిత శ్రీ కత్తిమండ ప్రతాప్ లు హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు.ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో కవితా పఠనం విభాగంలో "నారి లోకం" అనే కవిత తో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సూర్యపేట జిల్లా,హుజూర్ నగర్ మండలం,హుజూర్ నగర్ గ్రామంలోని యువ కవయిత్రి శ్రీపాద అర్చనా దేవి D/O రమణాచారి శ్రీ శ్రీ కళా వేదిక ప్రముఖులు అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. టీ ఎన్ ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) మరియు కల్చరల్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేస్తున్నట్లుగా ధృవీకరిస్తూ ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం అందజేసి,అనంతరం మెమంటో, శాలువ పూల మాలతో సత్కరించారు.దుంపాల వీరేష మాట్లాడుతూ. శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ "నారి లోకం" అనే కవిత ను ఉత్తమ కవితగా ఎంపిక చేసి శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో సన్మానంతో పాటు,ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం, జ్ఞాపిక ను అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని ముందు ముందు మరిన్ని మంచి కవితలు రాస్తానని ఆయన అన్నారు.ప్రపంచ రికార్డు నమోదు ప్రశంస పత్రం అందుకున్న శ్రీపాద అర్చనాదేవి ని పలువురు రాజకీయ వేత్తలు,గురువులు, గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు, అభినందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :