సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఖమ్మంలో ఈనెల 18న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ హరిసింగ్ నాయక్, రేగా కాంతారావు లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని, బీఆర్ఎస్ కు కొండంత అండగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలలో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సంపూర్ణ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారని, చేస్తున్నారని వివరించారు. ఖమ్మంలో ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారని, దీనికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఈ సందర్బంగా ఛలో ఖమ్మం పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మునిసిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అంకోతు బిందు, బీఆర్ఎస్ నాయకులు సర్థార్ పుట్టం పురుషోత్తం, వద్ధిరాజు కిషన్, గుండ్లపల్లి శేషగిరిరావు, గంధం రాములు, జెల్లల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin