సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీలో 16 లక్షల రూపాయలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యమే శ్రేయస్సు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీ శ్రీమతి భూక్యా సోనా, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, సర్పంచ్ పూనం నాగేశ్వరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, డైరెక్టర్లు శేషాద్రి వినోద్, బిఆర్ఎస్ నాయకులు వార్డ్ మెంబర్ నిమ్మకాయల సాంబశివరావు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు కృష్ణార్జునరావు, ఐక్ సత్యనారాయణ మరియు వైద్య సిబ్బంది, నర్సులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin