Saturday, 13 June 2026 11:35:40 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

వెనుకబడిన కులాల వారికి బి.జె.పి లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్... - బాలాజీ పవార్

Date : 23 October 2023 04:41 AM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా ,హైకోర్టు అడ్వకేట్ బాలాజీ పవర్... హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు దాదాపుగా 40 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది. కావున హుజూర్నగర్ ప్రాంతంలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీలు 80% ఈ ప్రాంతంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్నారు. కావున ఈ ప్రాంతంలో వెనుకబడిన కులాల వారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అలాగే ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో సందర్భంగా బీ. ఆర్.ఎస్ పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది . ఇప్పుడు కొందరు ఇతర పార్టీలకు వలసలు చేరటం జరుగుతుంది కొందరు నాయకులు ఎక్కడ లాభం ఉంటే అక్కడ నాయకులు పావులు కదుపుతున్నారు,కానీ ఈ ప్రాంతంలో ఉన్న వెనకబడిన కులాల వారిగా ఎక్కువగా మంది ప్రజలు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు నేను గుర్రంపొడు ప్రాంతంలో ఉన్న భూములను కొంతమంది నాయకులు కబ్జా చేయడం జరిగింది ,గుర్రంపొడు భూముల కోసం దాదాపుగా ఏడు సంవత్సరాలు పోరాటం చేయడం అలాగే ఈ ప్రాంతానికి బండి సంజయ్ రావడం అలాగే అధికార పార్టీ చెందిన నాయకులు మా పై కేసులు పెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు పిల్లలు లేరు ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలే మా పిల్లలు అని చేపారు .నేను ఈరోజు అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్న బహుజన బిడ్డల్ని ఎవర్ని ఆదరించావు , ఎవర్ని పెద్ద నాయకుడు చేశావు .ఎవరికి అవకాశం ఇచ్చావు, ఎవరిని పైకి తీసుకొచ్చావు, దీనికి సమాధానం చెప్పాలి అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ తోనే సైదిరెడ్డి గెలిచాడు , ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు,కాని ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు, కొత్తగా పార్టీలొకి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే పార్టీ గెలవలేదు కాబట్టి పార్టీ ఆలోచన చేయాలి అని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :