సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా కేంద్రంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ.బి లతో 87 మంది హోంగార్డులుగా చేరడంపై అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS సీరియస్.... 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ.బి లు సృష్టించి 87 మంది హోంగార్డులుగా చేరి విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి IPS ఆధ్వర్యంలో పూర్తీ స్థాయి విచారణ జరిపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు నకిలీ డి.ఓ లు సృష్టించి ఈ 87 మందిని హోంగార్డులుగా చేర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. ఈ తతంగంలో కొందరు డబ్బులు తీసుకుని కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. కీలక పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలు, ఈ తతంగం ఎలా కొనసాగిందనే కోణంలో కూలంకుషంగా దర్యాప్తు చేయాలని డి.ఐ.జి చిత్తూరు ఎస్పీ కి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై Cr.No.185/2022, u/s 420,419, 409, 468, 471 r/w 120(B) IPC సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఈ అక్రమంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటికి తీయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వైరిషాంత్ రెడ్డి IPS కి డి.ఐ.జి సూచనలు జారీ ...
-----------------------
Admin