సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు,మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి 67వ జన్మ దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు నిర్వహించి పేద,బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు..సఫాయి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దికరించి,23జిల్లాలో అన్ని హంగులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలను నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించారని వివరించారు..అంతేకాకుండా దాదాపు 200 ల ఇంటర్మీడియట్ కళాశాలలను ఏర్పాటు చేశారని మరో 5,549 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి ఉచిత విద్యను అందించిన గొప్ప నేతగా అభివర్ణించారు,28,419 గ్రామలకు అంబేద్కర్ గ్రామ నిర్మాణ్ పథకం ద్వారా అభివృద్ధి చేసిన ఘనత ఆమెకు దక్కిందని ప్రశంసించారు..భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసేందుకు అన్ని అర్హతలతో ముందుకు వస్తున్నారని ప్రజలు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు విసిగి పోయారని 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.. ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జున్ రావు,సాయి,అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,నాగుల రవికుమార్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin