సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం, చౌటపల్లి* గ్రామంలో బిఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అమలు కానీ ఆరు హామీలను ఇచ్చి గెలిచాక ఆ 6 హామీలను అటకెక్కించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, చేసిన రెండు హామీలు కూడా పూర్తిస్థాయిలో చేయక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని, పైగా రేవంత్ సర్కార్ ప్రజా పాలన చేస్తామంటూ చెప్పి ప్రజలను పీడిస్తోందని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో గత నెలలో భారీ వర్షాలతో చెరువులన్నీ కట్టలు తెగి రైతుల పొలాలన్నీ కొట్టుకుపోగా వారిని ఆదుకోకపోగా చెరువు పనులను గుత్తేదారులు ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ వాటి పైసలను వాటాలుగా పొందుతూ, చెరువు మరమ్మత్తు పనులను ఎక్కడికక్కడే గాలికి వదిలేశారని, ఇట్టి పనుల్లో పారదర్శకత లేక కాంగ్రెస్ లీడర్ల జేబులు నింపేదిగా ఉందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. గత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడిపి హైదరాబాద్ నగరాన్ని దేశంలోని అగ్రగామిగా నిలబెట్టారని, రేవంత్ మాత్రం పది నెలల్లో హైదరాబాదులో నివసించాలంటేనే భయపడేలా 144 సెక్షన్ విధించి ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పేద ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు రూపంలో దాదాపు 18 వేల కోట్ల రూపాయల భారం మోపాలని చూస్తే బి ప్రభుత్వ చొరవతో ఇ ఆర్ సి ఈ పెంపు ఉండబోదని తెలిపింది. కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్ , డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు , ఉద్యమ నాయకులు వేముల రంగాచారి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోలాహలం కృష్ణంరాజు , చౌటపల్లి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి వీరారెడ్డి , పలువురు మండల సీనియర్ నాయకులు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin