సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే : గ్రామపంచాయతీ కార్మికుల అన్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అన్నారు. శనివారం మోతే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గత 17 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత 17 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మనికడకే నష్టం కలిగించే విధంగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రమాదం వల్ల చనిపోయిన గ్రామపంచాయతీ కార్మికుడికి పది లక్షల రూపాయలు ఎక్స్రేసియా చెల్లించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఈ ఎఫ్,పి ఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించే అంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని గ్రామపంచాయతీ కార్మికులు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతుఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గుంట గానియేసు,గ్రామపంచాయతీ వర్కస్ యూనియన్ మండల అధ్యక్షులు చిట్యాల రవిచంద్ర, నాయకులు జలగం తిరుపతయ్య, పరశురాములు, పొడపంగి లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin