Friday, 31 July 2026 01:30:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ చౌరస్తాపై కెటిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం...

Date : 19 July 2023 03:13 AM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేటీఆర్ బొమ్మకు చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దయా దక్షిణాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన రాజ్యమేలుతుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం గూర్చి మాట్లాడే నైతిక అర్హత కెసిఆర్ కేటీఆర్ కుటుంబాలకు లేదని అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలని నినాదాలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని ప్రభుత్వం.. రైతుబంధు పేరుతో వ్యవసాయ పనిముట్లను దూరం చేస్తూ.. రైతులను దగా చేస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి చెల్లుతుందని విమర్శించారు. కేటీఆర్ నీతిమాలిన వ్యక్తి అని పరుష పదజాలాలతో దూషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :