సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగకు విశిష్టమైన స్థానం ఉందని, అనుబందాల పండుగగా రాఖీ పండుగను జరుపుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, మిడ్డే మీల్స్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితిల ఆధ్వర్యంలో గురువారం శేషగిరిభవన్లో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. కూనంనేనితోపాటు పార్టీ నాయకులకు మహిళా నాయకురాళ్లు రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణి చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ శ్రావణమాసంలో వచ్చే విశిష్టమైన పండుగ రాఖీ పండుగని అన్నారు. ఈ పండుగకోసం తోబుట్టువులంతా ఏడాదంతా ఎదురుచూస్తుంటారని, వీది నిర్వహణలో ఎంత దూరం ఉన్నప్పటికి కుటుంబ సభ్యులందరిని ఒక్కటి చేసి కుటుంబ బాంద్యవ్యాంన్ని, బందుత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు. తనకు రాఖీ కట్టిన మహిళా సమాఖ్య నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై. శ్రీనివాసరెడ్డి, పట్టాన నాయకులు గోనె సురేష్, జిల్లా నాయకురాళ్ళు కె.తర్నకుమారి, గోనె మణి, సత్తెనపల్లి విజయ లక్ష్మి, పొలమూరి ధనలక్ష్మి, మద్దెల విజయలక్ష్మి, పుట్టి భాగ్యలక్ష్మి, షమీమ్, జ్యోతి, రమ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin