సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణం లోని స్వాతి హాస్పిటల్ ఆర్తో యాక్సిడెంట్ కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ ప్రాంతానికి రకరకాల ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రవేటు సెక్టార్ కూడా విస్తరిస్తుందని నేడు అటువంటి అద్భుత స్థాయిలో హుజూర్ నగర్ వున్నదని అని తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సదుపాయాలు ఉండటం చాలా మంచిది అని,ప్రాణాలు కాపాడే అతి విలువైన సమయంలోనే ఆసుపత్రి కి చేరుకోవాలిసి యుంటాదని మరి అందుబాటులో ఆసుపత్రులు ఉంటే ప్రాణాలు కాపాడుకోగలుగుతామని తెలియజేసారు. అదేవిదంగా ఆసుపత్రి యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ,రోగులని బాధితులని ప్రేమతో, ఓపికతో చూడాలని, వైద్య ఖర్చులు కూడా పేదవారు సైతం చికిత్స చేపించుకునేల ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,నాయకులు,పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin