సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం : మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఏఎంసీ కాలనీ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల తీరు అధ్వానంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వ బడులలో సరైన వసతులు లేక విద్యార్థినీ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న పుస్తకాలు, నోట్ బుక్స్ పిల్లలకి కల్పించాల్సిన టువంటి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆగడాలు మితిమీరి పోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అడ్డగోలు దోపిడీ తో ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఫీజులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ బడులలో సరైన వసతులు కల్పిస్తే ప్రైవేట్ పాఠశాలలకు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారని మౌలిక వసతులు కల్పించకపోవడం వలన ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలలో సరైన మరుగుదొడ్లు లేక విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రతి పాఠశాలలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైనందున విద్యార్థులకు శుభ్రమైన కలుషితం లేని మంచినీరు పాఠశాలలలో అందించాలని, ప్రతి పాఠశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆయన కోరారు. గత కొద్ది సంవత్సరాల నుండి విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ లు చెల్లించకపోవడం దుర్మార్గమైన చర్య అని, పెండింగ్ స్కాలర్షిప్ లు చెల్లించకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా సాయి, భార్గవ్ సాయి రాజేష్, చిన్న, వినయ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin