సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : క్రీడాకారుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మండల స్థాయి పాఠశాల ఆటల పోటీ లే తొలి మెట్టు అని పాలకవీడు మండల విద్యాధికారి పానుగోత్ చత్రు నాయక్,ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ అన్నారు. పాలకవీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.విద్యార్థిని విద్యార్థులువిద్యారంగంతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలన్నారు.క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత విద్య లో,ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పిస్తాయి అని విద్యార్థిని విద్యార్థులు పి. వి సింధు, నీరజ్ లను ఆదర్శంగా తీసుకోవాలని, మీరందరూడివిజన్,జిల్లా,రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోఆడేలాఎదగాలని,స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలనిసూచించారు.అనంతరం వారు ఉపాధ్యాయులతో కలిసి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లోఎస్ఎంసి చైర్మన్ షేక్ జానీ ప్రధానోపాధ్యాయులు ఎం. బాలునాయక్, శ్రీరామ్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు బొడ్డుశ్రీనివాస్,సునీత,నాగయ్య,ఉపాధ్యాయుని ఉపాద్యాయులు కొనతం వెంకట్ రెడ్డి,ఉపేందర్,శ్రీరామ నుజం,షేక్ సిద్ధిఖ్,కవిత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin